చంద్రబాబు పట్టుబట్టడం వల్లే హైదరాబాదు నుంచి ఎమిరేట్స్ సేవలు ప్రారంభించాం.. ఏపీ సీఎంపై 'ఫ్లై దుబాయ్' సీఈవో ప్రశంసలు

  • చంద్రబాబు కార్యదక్షతను గుర్తు చేసుకున్న ‘ఫై దుబాయ్’
  • హైదరాబాద్ నుంచి  సేవలకు చంద్రబాబే కారణమన్న ఆ సంస్థ  సీఈవో
  • పట్టుబడితే పూర్తయ్యే వరకు వదలరని ప్రశంస
యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అభివృద్ధి వైపుగా శరవేగంగా నడిపిస్తున్నారని యూఏఈ ఆర్థికమంత్రి బిన్‌ సయీద్‌ అల్‌ మన్సూరీ ప్రశంసించగా, ప్లై దుబాయ్ సంస్థ కూడా చంద్రబాబు పట్టుదలను గుర్తుచేసుకుని కొనియాడింది.

యూఏఈ పర్యటనలో భాగంగా ఎమిరేట్స్‌ స్ట్రాటజీ అండ్‌ ప్లానింగ్‌ ఇన్‌చార్జి అద్నాన్‌ ఖాజిమ్‌, ఫ్లై దుబాయ్‌ సీఈవో ఘయిత్‌ అల్‌ ఘయిత్‌తో చంద్రబాబు  భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అద్నాన్ ఖాజిమ్ మాట్లాడుతూ చంద్రబాబు పట్టుదలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి సేవలు ప్రారంభించాలని పట్టుబట్టారని పేర్కొన్నారు. ఎమిరేట్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ఎంతో చొరవ చూపారన్నారు. చంద్రబాబు ఏదైనా పని తలపెడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించరని కొనియాడారు. ఆయన కార్యదీక్ష, పట్టుదల ఎలాంటివో తనకు తెలుసన్నారు. ఆయనలో ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని చూస్తున్నామంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.  
Go Back to Shorts
Chandrababu
ap cm
fly dubai

More Telugu News